30-05-2025 12:18:47 AM
కొత్తకోట మే 29 : వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం కనిమెట్ట రైతు వేదికలో వర్షాకాలంలో సాగు చేసే పంటలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.
భూసార సంరక్షణ, అధిక దిగుబడులను ఇచ్చే రకాలు, సమగ్ర ఎరువులు, యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, యాంత్రికరణ, కూరగాయల సాగు మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో రైతులు లాభాదాయక పంటలను వేసుకోవాలని సూచించారు. కూరగాయల సాగు కూడా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ పరమేష్ అధికారులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త సురేష్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేందర్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్త శ్రీనివాస్ ,మండల వ్యవసాయ అధికారి జాస్మిన్, వ్యవసాయ విస్తరణ అధికారి స్పందన, మాజీ సర్పంచ్ పరమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు యాదగిరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.