04-10-2025 12:00:00 AM
భారతీయ ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై ఉంది. అయితే ఇటీవల కర్ణాటకలోని ఆ లంద్ నియోజకవర్గంతో పాటు మహారాష్ర్టలోని రాజౌరా నియోజకవర్గంలో వెలు గుచూసిన ఓటర్ల జాబితా అక్రమాల ఆరోపణలు సంస్థ పారదర్శకత, నిష్పాక్షికతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 2022 డిసెంబర్లో ఆలంద్లో ఆన్లైన్ ఫారం ద్వారా 6,018 ఓటర్ల తొలగింపు అభ్యర్థనలు వచ్చాయి. వీటిలో కేవలం 24 మాత్రమే నిజమైనవిగా గుర్తించారు. మిగిలిన 5,994 మోసపూరితమైనవిగా తేలా యి. ఇది కేవలం స్థానిక సమస్య మాత్రమే కాదు. ఒక పెద్ద పథకం ప్రకారం జరిగిన కుట్రలాగా కనిపిస్తుంది.
ఎందుకంటే ఇ లాంటి అక్రమాలు మహారాష్ర్టలోనూ జరిగాయి. రాజౌరా నియోజకవర్గంలో 6,850కి పైగా బోగస్ ఓట్ల చేర్పులు జరిగాయి. ఈ ఘటనలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి జరిగిన ఉద్దేశపూర్వక ప్రయత్నాలుగా చూడాల్సిన అవసరముం ది. ఈ విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రవర్తన, ప్రతిస్పందనలు మరింత సందేహాలను కలిగిస్తున్నాయి.
అయితే ఈ అక్రమాలు మొదట ‘ఆలంద్’లో బయటపడ్డాయి. అక్కడ బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ) ఒకరు తమ సొంత కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపును గమనించి అప్రమత్తమయ్యారు. ఈ అభ్యర్థనలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మొబైల్ నంబర్లతో నమోదయ్యాయని తే లింది. జార్ఖండ్, చెన్ను, మహారాష్ర తదితర రాష్ట్రాల్లో ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ద్వారా అవకతవకలు జరిగినట్టు అనిపిస్తుంది. క ర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య దీని ని పెద్ద కుట్రగా అభివర్ణించారు.
కాంగ్రెస్కు బలమైన ప్రాంతాలలోనే ఈ తొలగిం పులు ఎక్కువగా జరిగాయని ఆరోపించా రు. అందుకు రాహుల్ గాంధీ ఆధారాలే సాక్ష్యమన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశ పూర్వకంగా ఓటర్ల జాబితాను మార్చడానికి చేసిన ప్రయత్నమని స్పష్టమవుతుంది. మరోవైపు, ‘రాజౌ రా’ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల చేర్పు లు ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి బాటలు వేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నది.
వ్యవస్థాగత లోపాలు
బీబీసీ నిర్వహించిన ఇన్వస్టిగేషన్ ప్రకా రం చూసుకుంటే 2024 అక్టోబర్లో ఫి ర్యాదు నమోదైనా.. 11 నెలల తర్వాత కూ డా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు. అలాగే ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల ను సంప్రదించలేదు. ఇది స్పష్టంగా వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతుంది. కానీ కర్ణాటక సీఐడీ 18 సార్లు ఐపీ అడ్రస్, డెస్టినేషన్ పోర్టులు, ఓటీపీ ట్రయల్స్ వంటి డేటాను అభ్యర్థించినా ఇవ్వలేదు.
ఈ ఆరోపణల విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషన ర్ జ్ఞానేశ్ కుమార్ ప్రతిస్పందన మరింత వివాదాస్పదంగా ఉంది. ఎలాంటి విచారణ చేయకుండానే మొదటి నుంచి ఈ ఆరోపణలను నిరాధారమైనవి అని కొట్టిపారేయడం చూస్తుంటే ఏదో ఒక పార్టీని సమర్ధించేలాగా అతని ప్రవర్తన కనిపిస్తుందే తప్ప ఎక్కడా నిష్పాక్షికంగా ఉన్నట్లు కనిపించటం లేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో సరైన సమాచారం లేకుండా అక్రమాల వెనుక ఉన్న పెద్ద తలకాయలను కనుగొనడం అసాధ్యం.
అందుకే రాహుల్ గాంధీ భారత ఎన్నికల సంఘం.. ‘ఓట్ చోరీలను కాపాడుతుంది’ అని స్పష్టమైన ఆరోపణలు చేశారు. ఆయన ఆరోప ణలు సమంజసమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం తనంతట తానుగా ఏ విషయాలను వెల్లడించడం లేదు. మూ డేళ్ల తర్వాతే ఈ కుట్ర బట్టబయలైంది. తాజాగా రాహుల్ ఆరోపణల తర్వాత ఆధార్ లింక్డ్ ఈ- వెరిఫికేషన్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. అయితే ఎన్నికల సంఘం ఈ పని ముందు ఎందుకు చేయలేదన్న ప్రశ్న ఉదయిస్తుంది. మరి ఇలాం టి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయా అనేది కీలక ప్రశ్న.
ప్రజాస్వామ్యానికి ముప్పు
ఆలంద్, రాజౌరా కేవలం ఉదాహరణలు మాత్రమే కావచ్చు. కానీ ఇలాంటి అ క్రమాలు ఇతర రాష్ట్రాలలోనూ జరిగి ఉం డవచ్చు. ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ ఉపయో గించి ఓటర్ల జాబితాలో సీరియల్ నంబర్లను టార్గెట్ చేసి బల్క్ అప్లికేషన్లు సమ ర్పించడం అనేది ఒక వ్యూహాత్మక ప్రణాళికగా చూడాల్సిన అవసరముంది.
కర్ణాటక సీఐడీ దర్యాప్తులో ఫేక్ ఐడీలతో 100 సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్టు తేలిం ది. ఇది ప్రొఫెషనల్ నెట్వర్క్ ఉనికిని ధృ వీకరిస్తుంది. ఇలాంటి మోసాలు ప్రజాస్వామ్యాన్ని నీరు గార్చుతాయి. ఎందుకంటే ఓ టర్లు తమ హక్కును కోల్పోతారు. అలాగే ఎన్నికల ఫలితాలు మార్చబడతాయి. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ ఇదంతా ఒక డ్రామా అని కొట్టిపారేస్తున్నప్పటికీ తగిన సాక్ష్యాలు ఉన్నప్పుడు దీనిని తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు.
కాగా ఇటీవలే ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేపట్టిన ప్రక్రియపై వివాదాలు, విమర్శలు చెలరేగాయి. అయితే వివాదాల మధ్యనే ఎస్ఐ ఆర్ కసరత్తు అనంతరం బీహార్ ఓటర్ల తుది జాబితాను మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలో 7.42 కోట్ల మంది ఓట ర్లు ఉన్నట్లు జాబితాలో తెలిపింది. ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టక ముందు ఈ సంఖ్య 7.89 కోట్లు ఉంటే సవరణల తర్వాత ఓటర్ల సంఖ్య 47 లక్షల మేర తగ్గినట్లు అయింది. అయితే ఆగస్టు 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా కన్నా (7.24 కోట్లు) ఈసారి 17.87 లక్షల మం ది ఓటర్లు పెరగడం గమనార్హం.
రాజకీయ పార్టీలు, వ్యక్తుల నుంచి అందిన అభ్యంతరాలను, ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ముసాయిదా జాబితాలో ఉన్న ఓటర్లలో 3.66 లక్షల మందిని తొలగించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అదే సమయంలో 21. 53 లక్షల మంది అర్హులను తుది జాబితాలో చేర్చిన ట్లు ప్రకటించింది. అయితే బీహార్లో ఓట ర్ల సంఖ్య పెరిగినప్పటికీ ఓటర్ల తొలగింపులో పలు లోపాలున్నట్లు కొందరు మే ధావులు అభిప్రాయపడుతున్నారు. అయి తే ఓటర్ల సవరణ జాబితాలోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నా రు. ఎక్కడ చూసినా బూత్ లెవల్ అధికారుల పర్యవేక్షణలో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినప్పుడు, వెరిఫికేషన్ ప్రక్రియ ఆఫ్లైన్గా జరగాలి. కానీ ఆలంద్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు హెచ్చరికలు చేసిన తర్వాతే చర్య లు తీసుకున్నారు. ఇది సిస్టమ్లోని లోపాలను ఎత్తిచూపుతుంది. డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న భారత్లో ఇలాంటి వాటివల్ల ఎవరికి లాభం చేకూరుతుందనేది ప్రశ్నగా మారింది. రాజకీయ పార్టీలు లేదా వారి మద్దతుదారులు ఓటర్ బేస్ను మార్చడం ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయవచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు, ఎందుకంటే సామాన్య పౌరుల విశ్వాసం కుదేలవుతుంది.
విచారణ అవసరం
ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కాపాడుకోవాలంటే, పారదర్శక చర్యలు తీసుకోవాలి. ముందుగా సీఐడీకి అవసరమైన డేటాను అందించాలి. అలాగే దేశ వ్యాప్తంగా ఓటర్ జాబితాల ఆడిట్ను చేపట్టాలి. అత్యున్నత స్థాయి జ్యుడీషియల్ క మిషన్ లేదా అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన కమిటీ ద్వారా ఈ విషయంలో విచారణ జరపాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, 326 స్ఫూర్తిని కాపాడుకోవాలి. ఇది స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఎన్నికలను నిర్ధారిస్తుంది. ఇప్పటికైనా చర్య తీసుకోకపోతే భవిష్యత్ ఎన్నికల్లో మరిన్ని అక్ర మాలు, అవకతవకలు జరగవచ్చు. ఇది ప్రజాస్వామ్య మూలాలను బలహీనపరుస్తాయి. ఇది కేవలం ఒక రాజకీయ డ్రామా మాత్రంగానే చూడకుండా దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయమని గుర్తుంచుకోవాలి.
వ్యాసకర్త సెల్: 9849328496