13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నిర్లక్ష్యానికి తావు లేదు

20-01-2026 12:00 AM

మహా మండపం పనులపై విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలు

వేములవాడ, జనవరి 19,(విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభి వృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో నిర్మాణంలో ఉన్న మహామండపం రాఫ్టింగ్ ఫౌండేషన్ పనులను ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా జరుగుతున్న పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో విప్ సమీక్ష నిర్వహించారు.

నిర్దేశిత గడువులోపు పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, ఆలయ అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచే సుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కాగా, సోమవారం సమ్మక్కసారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా వేముల వాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ విప్ను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఇంజినీరింగ్ విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.