29-05-2025 12:00:00 AM
ప్రపంచ దేశాలలోని పరిస్థితి ఏ మిటో కానీ మన దేశంలోని ప్ర త్యేకించి కొందరు రైతుల దుస్థితి మాత్రం ఎవరికీ ఉండవద్దు. వాణిజ్య పంటలు, ఆ హార ధాన్యాలు సాగు చేసేవారికి, చివరికి పూలమొక్కలు పండించే వారికన్నా కూడా ముఖ్యంగా కూరగాయలు ఉత్పత్తి చేసే రైతన్నల పరిస్థితి మాత్రం అత్యంత దయనీ యం. ఈ దేశంలో ఒక పరిశ్రమలో ఏదో ఒక వస్తువును ఉత్పత్తి చేసే పారిశ్రామికవేత్తకు ఉన్నపాటి కనీస వ్యాపార స్వేచ్ఛ అ యినా ఒక సగటు రైతుకు లేదంటే మొత్తం రాజకీయ వ్యవస్థ సిగ్గు పడాలి.
ఉదా॥కు టమోటాల ధరలనే తీసుకుందాం. అత్య ల్ప స్థాయిలో మరీ కిలో రెండు రూపాయ లు కూడా విలువ చేయనంత అగౌరవ మా! భారతదేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం కూడా ఇటీవలి కాలంలో మార్కెట్ పలికిన ధరను చూస్తుంటే, ఎంతటి వాళ్ళకైనా అయ్యో పాపం అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఒక్క టమోటాల రైతులకే ఎందుకీ దుస్థితి!?
వాస్తవానికి చూడటానికి ఇదేమంత పె ద్ద సమస్య కాదనిపిస్తుంది. కానీ, ఇందులో అంతుబట్టని పెద్ద సమస్య నిక్షిప్తమై ఉం దని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీనుంచి ఆయా రాష్ట్రాల గ్రామాల వరకు టమోటా పంటకు రైతులకు ఆశించిన ధర లభించడం లేదు. గత కొన్నేళ్లుగా అడపాదడపా ఇదే దృశ్యం చూ స్తున్నాం. ఈ వేసవిలోనూ భారతదేశం అంతటా పుష్కలంగా టమోటాలు మార్కెట్లకు వచ్చాయి.
అంతే స్థాయిలో చౌక ధర లకే అమ్ముడవుతున్నాయి. పంట మార్పి డి, హైబ్రిడ్ విత్తనాలు, ప్రకృతి వనరుల లభ్యతల కారణంగా పుష్కలంగా దిగుబడి వస్తున్నది. కానీ, ఆ మేరకు దేశంలోని చాలాచోట్ల వాటి టోకు ధరలు ఈ ఏడాదికూడా పడిపోయాయి. ఫలితంగా రైతుల కు అవాంఛిత నష్టాలు తప్పడం లేదు.
ఢిల్లీనుంచి గల్లీవరకు ఇదే దుస్థితి
సాధారణంగా ఎక్కడైనా మార్కెట్లలో రిటైల్ ధరలు ఆయా ప్రాంతాల వారీగా మారుతుంటాయి. ఈ వ్యాసం రూపొందించే సమయానికి హిమాచల్ప్రదేశ్లో టమోటాల ధర కిలోకు రూ. 90 వరకు ఉంది. కానీ, ఆశ్చర్యంగా అదే కిలో ధర తమిళనాడులో రూ.19, చెన్నైలో రూ.30 మాత్రమే వినిపించింది. ఇంకా కొన్నిచోట్లయితే మరికొందరు మధ్యలో మరింత తక్కువ చెల్లిస్తామంటారు.
ఆన్లైన్ రిటైలర్లుకూడా కిలోకు రూ.25 వరకే అమ్ముతు న్నట్టు తెలిసింది. కానీ, ఏడాది కిందటే 2024 చివరిలో, భారతదేశమంతటా ట మోటా ధరలు పెరిగాయి. ఢిల్లీలో రూ.65 కి, దేశంలోని కొన్నిచోట్ల రూ.100కి పైగా అమ్ముడయ్యాయి. టమోటాల ధరలు ఇం త చౌక స్థాయికి రావడం ఇదే మొదటిసారి కాదు.ఇటీవలి సంవత్సరాలలో ట మోటాల ధరలు ఉన్మాదకరంగా ఉన్నట్టు మార్కెట్ నిపుణులు అంటున్నారు.
దీంతో వీటిని పండించే రైతుల దుస్థితి అగమ్యగోచరం. ఇంటీరియర్ మండీలలో అయితే మరీ తక్కువ స్థాయిలో టోకు ధరలు కిలోగ్రాముకు రూ.7 నుంచి 27 మధ్య ఉంటు న్నట్టు సమాచారం. కొన్ని వారాల క్రితం కర్ణాటకలోని కలబుర్గి నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ధర కిలోకు రూ.2, తమిళ నాడులోని ధర్మపురిలో రూ. 6 వరకు పడిపోయిందంటే పరిస్థితి అర్థమవుతున్నది. టమోటా మద్దతు ధర విషయంలో నిజంగా ఏం జరుగుతోంది?
క్యాప్సికమ్, బంగాళాదుంపలు కూడా!
రైతులకు బాధ కలిగించే ఏకైక కూరగాయల పంట ఒక్క టమోటాలు మాత్రమే కాదు. ఈ నెలలో ఢిల్లీ సరిహద్దు అవతల నుంచి గ్రామీణ ఉత్తరప్రదేశ్ నుంచి ఎద్దులబండ్లపై బంగాళాదుంపలను కిలోకు రూ.8కి మాత్రమే విక్రయించినట్లు సమాచారం. ఇవే కాదు, బెంగాల్లో క్యాప్సికమ్ హోల్సేల్ ధరలు కిలోకు రూ.6కి పడిపోయాయి. ఇది భారతదేశంలో కూరగాయ లు పండించే రైతన్నల దీనస్థితి.
ఈ నేపథ్యంలోనే కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్)తో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వమే ముందుకు రావాలి. పంజాబ్ లో రైతులు గత నెలలో క్యాప్సికమ్ను కి లోకు రూ.2కి అమ్మిన కఠోరసత్యాన్ని మా ర్కెట్ నిపుణులు జీర్ణించుకోలేకున్నారు. అయితే, ఇదే క్యాప్సికమ్ ధర ఒక సంవత్సరం క్రితం కిలోకు రూ.25గా ఉండింది.
భారతదేశంలోని కూరగాయల రైతుల పరిస్థితే ఇలా ఉండటం బాధాకరం. ఇదే సమయంలో గోధుమలు, బియ్యం, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి వాణిజ్య పంటలు పండించే వ్యవసాయదారులకు మరీ ఇంతటి గడ్డు పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే అమూల్ (డైరీ) అభివృద్ధి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. పాలు ఒకప్పటి కొరత దశనుంచి పుష్కలంగా లభించే స్థితికి చేరుకున్నాయి.
ఇదంతా సహకార ఉద్యమం, సేకరణ ధరలు, పాలకోసం లాజిస్టిక్స్ వంటివాటి మేలు కలయి కలవల్ల సాధ్యమైంది. ఒక రకంగా పాడిరైతులు అభివృద్ధి చెందడానికే కాక వినియో గదారులూ తల్లి పాల ప్రత్యామ్నాయాల కోసం పోరాడే స్థితినుండి సులభంగా, చౌకగా వాటితోపాటు ఐస్క్రీం వరకూ అన్ని పాల ఉత్పత్తులూ పొందే పరిణామానికి చేరుకున్నారు.
చెత్తకుప్పల పాలు కాకముందే..
ఇప్పుడు మనకు కావలసింది కూరగాయలకు కూడా ఇలాంటి యంత్రాంగమే. కానీ అది అంత సులభం కాదని నిపుణు లు అంటున్నారు. కూరగాయలు కూడా పాలు లాగా కొద్దిగంటలకే పాడైపోతాయి. కాగా, ‘కోల్డ్ చైన్ లాజిస్టిక్స్’ భారతదేశంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. అవి ఏమైనప్పటికీ రైతులు మోయగల ఖర్చులను పెంచుతాయని చెప్పాలి. కానీ, వారు ప్రకృతితో జూదం ఆడతారు.
వీలైనంత త్వ రగా అందుబాటులో ఉన్న ఉత్తమ ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకోవాలని చూ స్తారు. ధర సరిగ్గా లేకపోవడంతో తమిళనాడు రైతులు అమ్ముడుపోని టమోటా లను పారవేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక్క ఆ రాష్ట్రమేకాదు, దేశంలోని అనేక ప్రాంతాలలోనూ ఈ రకమైన పరిస్థితి లేదని చెప్పలేం. టమోటాలు అమ్ముడుపోక, వాటిని పాడుకాకుండా రక్షించు కోలేక అలా చెత్తపాలు చేస్తున్న సంఘటనలు అనేకం సంభవిస్తుంటాయి.
వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముడుపోని స్థితిలో వృథా చేయడం సర్వసాధార ణం. లక్షలాది మంది ఆహారం కోసం ఎదురుతెన్నులు చూసే భారతదేశం ఇంత త్వ రగా ఆ దశకు చేరుకుంటుందని విజ్ఞులైన వారెవరూ ఎప్పుడూ అనుకొని ఉండరు.
ప్రపంచ వ్యాప్తంగా అసలే, అకాల అనూ హ్య వర్షాలు, తెగుళ్లు, రవాణా, అమ్మకపు పద్ధతులతో ఇబ్బందులు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేకించి కూరగాయలు సరఫరా లో అస్థిరత్వాన్ని ఎదుర్కొంటుంటాయి. రైతుల దాతృత్వం వారి నిష్పాక్షికత వలె ఆమోదయోగ్యం కాదు.
ప్రభుత్వాలే పట్టించుకోవాలి!
ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కూరగాయల మద్దతు ధరల విష యంలో ఏమైనా చేయగలవా? అన్న ప్ర శ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఇటీవలి పశ్చిమ బెంగాల్ క్యాప్సికమ్ ఉదాహ రణ, అముల్ కథ మనకు కొంత ప్రేరణనిస్తాయి. అయితే, ప్రభుత్వాలు రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఖర్చులు, నిల్వ లాజిస్టిక్స్ రెం డింటి గురించి ఆలోచించవలసి ఉంది. మార్కెట్- మేకింగ్ యంత్రాంగాన్ని ఇందు కు అనుగుణంగా సంసిద్ధం చేయాలి. రా ష్ట్రాల మద్దతుగల సహకార సంస్థలు ఊహాత్మకంగా కూరగాయలను స్వల్పలాభంతో కొనుగోలు చేసి అమ్ముతుండడం సహజమే.
అయితే, వినియోగం చాలా తక్కువ గా ఉన్నప్పుడు ఇది ఫలవంతం కాదు. ఎందుకంటే, ఉత్పత్తిని తీసుకునే వారు ఎవరూ ఉండరు. ఈ క్రమంలో ప్రభుత్వం చేయగలిగేది ఏమిటంటే, ‘ప్రాక్సీ ప్రైసింగ్’ పద్ధతి. రైతులకు సులభమైన రుణ సౌకర్యాలు కలిగించడంతో పాటు -ఎగుమతిదా రులకు అందించే రకమైన వడ్డీ రేటు రాయితీలను కూడా ఏర్పాటు చేయగలగాలి. దానిని పంటబీమా కోసం క్రెడిట్తో అనుసంధానించాలి. ప్రభుత్వం హరిత విప్లవం కొత్త రూపాంతరాన్ని రూపొందించడానికి నిపుణులను పనిలో పెట్టాలనే ఆలోచనలో ఉంది.
వ్యవసాయం వినియోగదారునికి, రైతుకు మధ్య ఒక బలమైన బంధం వంటిది. ‘ఒక వ్యక్తి ధర మరొక వ్యక్తి ఆదాయం’ అనే సామెతను గుర్తుంచుకోవాలి. ఇంకా, పరిశ్రమల ఉత్పత్తుల కంటే కూడా విశాలమైన దృష్టిని కూరగాయల రైతుల పట్ల ప్రభుత్వాలు అమలు చేయాలి. అప్పుడే వారి కష్టానికి తగిన కనీస ప్రతిఫలం అందుతుంది.