calender_icon.png 1 November, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

01-11-2025 01:35:50 PM

వనపర్తి టౌన్ : వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ సంఘటన వనపర్తి జిల్లా(Wanaparthy district) కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో నివాసం ఉంటున్న కురుమూర్తి జిల్లా కేంద్రం లోని ఓ మాల్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. తన సోదరుడు మూడు రోజులుగా కనిపించడం లేదని చెన్నమ్మ అక్టోబర్ 28న పోలీసులకు పిర్యాదు చేశారు.

వనపర్తి పట్టణ రెండో ఎస్ఐ. శశిధర్ కేసును నమోదు చేశారు. విశ్వనీయ సమాచారం మేరకు కురుమూర్తి భార్య నాగమణి మెట్టుపల్లికి చెందిన నందిమల్ల శ్రీకాంత్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఇద్దరు కుట్రపన్ని కురుమూర్తిని హత్య చేశారు. అనంతరం సెల్ప్ డ్రైవింగ్ పేరిట వనపర్తిలో కారు అద్దెకు తీసుకొని శ్రీశైలం వెళ్లి డ్యాంలో కురుమూర్తి మృతు దేహం పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ పట్టణ పోలీసులకు పిర్యాదు చేయడంతో నాగమణి, శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య ఉదంతo బయటపడింది. కురుమూర్తి మృతదేహం కోసం నిందితులిద్దరిని శ్రీశైలం డ్యాం వద్దకు తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.