12-12-2024 01:14:51 AM
నలుగురు నిందితులకు రిమాండ్
నల్లగొండ, డిసెంబర్ 11 (విజయక్రాంతి): మంత్రాలు చేస్తుందనే నెపం తో మహిళను అంతమొందించేందుకు యత్నించిన నలుగురిని నార్కె ట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నార్కెట్పల్లి సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకా రం.. నార్కెట్పల్లి మండలం అక్కనపల్లి గ్రామానికి చెందిన ఏనుగుల ఝూన్సీ కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నది.
అదే గ్రామానికి చెందిన బెక్కంటి పుల్లమ్మ చేసిన మంత్రాలే కారణమని ఆమె కుటుంబీకులు కక్ష పెంచుకున్నారు. ఈ నెల 7న ఝూన్సీ భర్త దయాకర్ అతడి తండ్రి నర్సింహ, తల్లి జయమ్మతోపాటు మామ మిడిదొడ్డి సత్తయ్య కలిసి పుల్లమ్మ ఇంటికి వెళ్లి గొడవపడి చంపుతామని బెదిరించారు.
ఈ నెల 9న పుల్లమ్మ కూలికి వెళ్లి ఇంటికి వస్తుండగా గ్రామ కూడలిలో పథకం ప్రకారం దయాకర్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. అటుగా ఆమె భర్త యాదయ్య రావడాన్ని గమనించి పరారయ్యాడు. బాధితురాలికి మొహం, వీపు భాగంలో గాయాలయ్యాయి. ఘటనపై ఈ నెల 10న పోలీసులకు ఫిర్యా దు చేసింది. నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దయాకర్తోపాటు అతడి తల్లిదండ్రులు, మామను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.