7 May, 2026 | 3:36 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

సంక్షేమ గురుకుల పాఠశాల ఎదుట మహిళ ధర్నా

10-12-2024 07:16 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ డబ్బులకు ఆశపడి తనకు అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ ఉష అనే ఓ మహిళ పాఠశాల ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను వాచ్మెన్ విధుల నుండి ఆకారణంగా తొలగించారని డబ్బులకు ఆశపడి వేరే మహిళను విధుల్లోకి తీసుకొనే ప్రయత్నం చేస్తుందన్నారు. తనకు న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఉష స్పష్టం చేశారు. తనను తొలగించాలనే ఉద్దేశపూర్వకంగా పాఠశాల ప్రిన్సిపాల్ సొసైటీలో నిబంధనలను అడ్డు చూపుతూ పాఠశాలకు సంబంధం లేని మరో మహిళను విధులు అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.