17 April, 2026 | 1:39 AM

సారంపల్లిలో గ్రామపంచాయతీ భవన పనులకు మళ్లీ ఊపొచ్చింది

12-01-2026 09:34 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించి నిలిచిపోయిన పనులను సర్పంచ్ గుగ్గిళ్ల లావణ్య నర్సయ్య ఆధ్వర్యంలో పునఃప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా భవనాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వంశీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ రాజు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.