31 May, 2026 | 5:24 PM

డిపో ఎదుట కార్మికుల నిరసన

31-05-2026 04:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆదివారం డిపో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎర్రబెడ్లు కట్టుకొని నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ... ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు ఎన్నికలు అయినా తర్వాత విలీనం చేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం కార్మికుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని జే ఏ సి నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జూన్ 2వ తేదీ రోజు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ప్రకటించాలని ఆర్టీసీ జే ఏ సి. నాయకులు కోరారు. లేని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.కార్యక్రమంలో ఉద్యోగులు నాయకులు పాల్గొన్నారు.