11-05-2025 12:00:00 AM
సోషల్ మీడియా.. ఎందరో మహిళలను స్టార్లుగా మార్చింది. టెక్నాలజీ అంటే ఏంటో తెలియని బామ్మలను ఓవర్నైట్ స్టార్లుగా మార్చింది. యూట్యూబ్లో వంటలు చేస్తూ సెన్సేషన్గా మారింది. తన వంటలతో.. ఎందరో ఫాలోవర్లను దక్కించుకున్నది ఈ 74 ఏళ్ల డిజిటల్ క్వీన్.
మహారాష్ట్రకు చెందిన సుమన్ ధమానేకు 74 ఏళ్ల వయసు. ఈ వయసులో కూడా ఆమె కుటుంబ సహాయంతో ‘ఆప్లీ ఆజీ’ అనే యూట్యూబ్ ఛానెల్ను నడిపిస్తున్నది. ఆమె యూట్యూబ్ ఛానెల్కి ఏకంగా 1.79 మిలియన్ల మంది సబ్స్కైబర్లు ఉన్నారు. అంచనాలకందని విధంగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం అతిపెద్ద విషయం అనుకుంటే.. ఎవ్వరూ ఊహించని రీతిలో సంపాదన ఆర్జించడం మరింత విశేషం. యూట్యూబ్ ఛానెల్లో మహారాష్ట్ర వంటకాల రుచులను పరిచయం చేసింది ఈ బామ్మ.
ఎప్పటికప్పుడు కొత్తదనంతో.. కాలానుగుణ రుచులతో ఆరోగ్యకరమైన వంటకాల వీడియోలతో అలరిస్తుంది. ఇంట్లో ఉండే సుగంధద్రవ్యాలతో ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేయడం ఎలా అనే వీడియోలతో.. ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చే ఆహారప్రియులను బాగా ఆకర్షించింది. అదే ఆమెకు మంచి స్టార్డమ్ని తెచ్చిపెట్టింది. ఆకర్షణీయమైన పావ్ భాజీ, కరేలే కి సబ్జీ, మహారాష్ట్ర స్వీట్ల వరకు ప్రతిదీ నోరూరించేలా ఆరోగ్యకరంగా చేసుకోవడం ఎలాగో పరిచయం చేసింది.
తాజా కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. అలా యూట్యూబ్ సిల్వర్ బటన్ను కూడా దక్కించుకున్నది. ఈ బామ్మ తన యూట్యూబ్ ఛానెల్తో నెలకు రూ.5 నుంచి రూ.6 లక్షల పైనే సంపాదిస్తుందట. విజయానికి వయసు అడ్డంకి కాదని చూపించడమే గాక కుటుంబ మద్దతుతో దేన్నైనా సాధించగలమని నిరూపించింది.