calender_icon.png 7 June, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూతురుపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు

06-06-2025 12:00:00 AM

నిర్మల్, జూన్ 5(విజయక్రాంతి): కూతురిపై కామంతో కళ్ళు మూసుకొని అత్యాచా రానికి పాల్పడిన తండ్రికి గురువారం నిర్మల్ జిల్లా జడ్జి శ్రీవాణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.౫వేల జరిమానా విధించినట్టు ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు.  2021, ఏప్రిల్ 16న సోన్ మండలంలోని గాంధీ నగర్ గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆరేళ్ల కూతురుపై అదే గ్రామానికి చెందిన తండ్రి అత్యాచారానికి పాల్పనట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్పటి డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి సోన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయ గా తండ్రి చేసిన నేరం రుజువు కావడంతో గురువారం జిల్లా జడ్జి శ్రీ వాణి తీర్పు వెలబడినట్లు వారు వివరించారు. కేసును కోర్టు లో బలంగా వాదనలు వినిపించిన పోలీస్ సిబ్బందికి న్యాయవాదులకు ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.  నేరం చేసిన వారు ఎవరైనా తప్పించుకునే పరిస్థితి ఉండదని నేరాలు తగ్గించేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.