calender_icon.png 7 June, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో ఎల్లారెడ్డిపేట సర్వేయర్

01-06-2025 12:09:56 AM

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నాగరాజు

సిరిసిల్ల, మే 31 (విజయక్రాంతి): స్థలం సర్వే చేసేందుకు ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటున్న ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజును శనివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం తన స్థలాన్ని సర్వే చేయాలని అధికారులను సంప్రదించాడు.

తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సర్వేయర్ నాగరాజు రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో రూ.21 వేలు ఇచ్చిన మల్లేశం.. శనివారం సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేట రైతువేదిక వద్ద రూ.15వేలు తీసుకుంటుండగా నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.