22-06-2025 12:00:00 AM
పటాన్చెరు రెజోనెన్స్ గురుకులంలో నిర్వహణ
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ఇషా ఫౌండేషన్ మార్గదర్శనంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని రెసోనెన్స్ గురుకుల క్యాంపస్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగా ఆసనాలు వేశారు. ఇషా ఫౌండేషన్కు చెందిన యోగా శిక్షకులు హర్షప్రియ, సంకేత్ దాత్ల, రవిచంద్ర నేతృత్వం వ హించారు. శారీరక ఆసనాలు, శ్వాస ప్రక్రి య ద్వారా మానసిక ప్రశాంతత, అంతర్గత బలాన్ని పెంపొందించే దిశగా మార్గనిర్దేశం చేశారు.
రెసోనెన్స్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ బీ వీరేందర్ మాట్లాడుతూ.. యోగాతో విద్యార్థులకు కేవలం శారీరక పటుత్వమే కాకుండా, ఏకాగ్రత, భావోద్వేగ స్థిరత్వం వంటివి అలవడుతాయన్నారు. ప్రిన్సిపాల్ ఫణి మోహన్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో పిల్లలు యోగా అభ్యసిస్తే మానసిక ఆరోగ్యం రెట్టింపు అవుతుందన్నారు.
ఇషా ఫౌండేషన్ సీనియర్ యోగా గురువు హర్షప్రియ మాట్లాడుతూ.. ప్రతి రోజూ యోగా సాధన చేయాలన్నారు. దీనిని ఒక శక్తివంతమైన అలవాటుగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 1500 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.