21-06-2025 11:17:02 PM
చివ్వేంల: నూతన మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నికైన ధరావత్ పార్వతి సోమానికి శనివారం పాండ్య నాయక్ తండాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... మండలంలోని మహిళకు ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అందే విధంగా సమన్వయంతో ముందుకు నడిపించాలని , పొదుపు సంఘాల ద్వారా మహిళల అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధరావత్ బిక్షం,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఛత్రు, లాలు, సైదా, మోహన్, హనుమా, శంకర్ తదితరులు పాల్గొన్నారు..