11-06-2025 12:00:00 AM
ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా అని చిరంజీవి అన్నారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. “ఫోకస్ వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది. యోగా చేస్తే ఈ రెండూ వస్తాయి. యోగా డేను సెలబ్రేట్ చేసుకుందాం. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. సరిహద్దులు దాటి దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం” అని రాసుకొచ్చారు.
యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు అంతర్జాతీయ యోగా మాసోత్సవాలను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. జూన్ 21న ఏపీలో యోగా దినోత్సవం నిర్వహణకు తానెంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని ప్రధాన నరేంద్ర మోదీ తెలిపారు. మెగాస్టార్ సైతం ఈ విషయంపై స్పందించారు.