01-12-2024 12:00:00 AM
ఆసియా అండర్ 19.
దుబాయ్: ఆసియా అండర్ 19 మ్యాచ్ లో భారత జట్టుపై పాకిస్తాన్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోరు సాధించింది.
షాజైబ్ ఖాన్ (159) సెంచరీతో కదం తొక్కాడు. 282 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ 47.1 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌట్ అయింది.