13 April, 2026 | 4:26 PM

Breaking News

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •  

యువతి ఆత్మహత్య

29-10-2025 12:00 AM

మంచాల పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ధర్నా

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 28: సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని యువతి మృతి చెందిన ఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మంచాల మండలం అరుట్ల గ్రామానికి చెందిన పంబాల దుర్గేష్, సంతోష అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె అయిన నందిని (19), సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కాగా కూలీ పనులకు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన తండ్రి దుర్గేష్, ఇంట్లో తన కూతురు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మృతికి గల కారణాలు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం కావడంతో మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మంచాల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠా యించారు. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. అనంతరం బాధిత కుటుంబానికి 20 గుంటల భూమి ఇస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా పోస్టు మార్టం, అంత్యక్రియలు జరగనున్నాయి.