14-06-2025 12:51:30 AM
మనోహరాబాద్, జూన్ 13 : పొలం పనికి వెళ్ళిన యువకుడు అనుమానాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...గ్రామానికి చెందిన చిన్నబత్తుల ఆంజనేయులు(35) తన వ్యవసాయ పొలం పనుల కోసం గురువారం ఉదయం వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు.
దీంతో అతని భార్య పలుమార్లు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్ళి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని ఉన్నాడని మృతుని భార్య నవనీత పేర్కొన్నట్లు తెలిపారు. తన భర్త మరణంపై అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపినట్లు ఎస్త్స్ర సుభాష్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.