14-06-2025 12:50:43 AM
సిద్దిపేట,(విజయక్రాంతి): మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పూజారి ప్రవీణ్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 10 మంది విద్యార్థులచే తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల పక్షాన విద్యార్థులకు పలకలు అందజేసి, మిఠాయిలు పంపించేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా షరీఫ్, అమ్మ కమిటీ చైర్మన్ ప్రేమలత, భారతమ్మ, ఉపాధ్యాయులు సురేష్ కుమార్, వర ప్రసాద్, యాదయ్య, లలిత, సునీత, నాగమణి, వాణి, అంగన్వాడి టీచర్లు లక్ష్మీ,రామవ్వ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.