14 July, 2026 | 7:01 PM

Breaking News

పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •  

ఎస్ఐ సార్ మీ పనితీరు భేష్

24-12-2025 09:57 PM

గరిడేపల్లి ఎస్ఐ ని సన్మానించిన యూత్ సభ్యులు 

గరిడేపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా అమలుపరచిన గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ ను మండలంలోని యూత్ సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు. జై భీమ్ అధ్యక్షులు కొత్తపల్లి రవి, కుర్రి వెంకన్న మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా రాత్రి పగలు నిద్రాహారాలు మాని గ్రామ గ్రామాన గస్తికాస్తు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా అమలుపరచి ఎలక్షన్ సజావుగా నడిపించినందుకు ఆయనను ఘనంగా సన్మానించినట్లు వారు తెలిపారు. సన్మానించిన వారిలో దూరే వినోద్, కడప వీరస్వామి, నకిరేకంటి రవి, కొత్తపల్లి మైసయ్య, పిట్ట వెంకటేష్, మచ్చ ఆదాం, మధు, నాగార్జున, పవన్, వేణు, రాజేష్, గౌతమ్, పండు యూత్ సభ్యులు పాల్గొన్నారు