calender_icon.png 29 October, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నింటిలో యువత భాగస్వాములు కావాలి

29-10-2025 04:31:04 PM

మెగా రక్తదాన శిబిరంలో సీపీ అంబర్ కిషోర్ ఝా

జైపూర్ (విజయక్రాంతి): యువత అన్ని రంగాలలో భాగస్వాములు కావాలని, సేవా భావం పెంపొందించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని మహి ఫంక్షన్ హల్ లో జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం, ఓపెన్ హౌస్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ భాస్కర్ తో కలిసి శిబిరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వాహనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ చేసేటువంటి సేవా కార్యక్రమాలకు ప్రజలు, యువత సహకరించినప్పుడు పోలీసుల్లో ఉత్సాహం, విశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మారుమూల ప్రాంతాలను సందర్శించడం,  ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం ఒక పోలీస్ శాఖతోనే సాధ్యమవువుతుందన్నారు. రక్తదానం ప్రాణధానంతో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. 

ఆకట్టుకున్న ఓపెన్ హౌస్...

విద్యార్థినీ, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ అందరిని ఆకట్టుకుంది. ప్రజా రక్షణ, భద్రత సంబందించిన పోలీసు చట్టాల గురించి, పోలీసు విధులపై, షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత, షీటీమ్, భరోసా,  గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్, తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు, సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.

పలు ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్ధిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపు, పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగించే లక్ష్యంతో చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఉత్సాహపరిచింది. ఈ సందర్భంగా స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా, విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో  మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్, చెన్నూర్ సీఐ దేవేందర్, చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, మహిళ పోలీస్ స్టేషన్ సీఐ కె నరేష్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్ ఐ సంతోష్, లక్ష్మి ప్రసన్న, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.