7 April, 2026 | 1:37 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

నేతాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి : కార్పొరేటర్ శాంతి

23-01-2026 05:57 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నేతాజీ  సుభాష్ చంద్రబోస్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని నాచారం కార్పొరేటర్ శాంతి అన్నారు. సుభాష్ చంద్రబోస్ 129 జయంతి సందర్భంగా నాచారం డివిజన్లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆయన జీవితం దేశభక్తి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రమశిక్షణ దేశభక్తి దైవభక్తి ఉన్న సేవా తత్పరుడు సుభాష్ చంద్రబోస్ అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్ పాండు గౌడ్  మోహన్ రెడ్డి రామకృష్ణ సాయిబాబా అభిషేక్  పాల్గొన్నారు