12-12-2024 12:15:47 AM
హరారే: సొంతగడ్డపై అఫ్గానిస్థాన్తో జరుగుతున్న టీ20 సిరీస్లో జింబాబ్వే శుభారంభం చేసింది. హరా రే వేదికగా ముగిసిన తొలి టీ20లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరు గులు చేసింది.
కరీమ్ జనత్ (54*) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి గెలుపొందింది. బ్రియాన్ బెన్నెట్ (49) రాణించగా.. ఆఖర్లో ముసెకివా (26*) జట్టును గెలిపించాడు.