29 April, 2026 | 9:46 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణకు ఘన సన్మానం

09-03-2026 09:52 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లను ఘనంగా సన్మానించారు. ఇటీవల డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన 10 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో పాటు సాలెగూడ సర్పంచ్ వందనలను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్లా కలిసి మహిళా నేతలను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహిళా నాయకురాళ్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలు రాజ్యాధికారంలో కీలక పాత్ర పోషించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.