calender_icon.png 21 November, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సాగుపై పలు తండాల్లో తనిఖీలు.. సాగు చేస్తే కఠిన చర్యలు

16-08-2024 09:26:56 PM

కామారెడ్డి: గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లాలోని పలు తండాల్లో పోలీసులు శుక్రవారం తనీఖీలు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధారి మండలంలోని నేరేల్ తండా, చద్మల్ తండ, బీర్మల్ తండ, కొత్త బాది తండా, గుజ్జుల్ తండా, సోమారం తండా, గొల్లాడి తండాలల్లో పంట పొలాలలో అడవి భూములలో దాదాపు 100 మంది సిబ్బందితో కలిసి తనిఖీలు చేయడం జరిగింది. ఎవరైనా గంజాయి పండించిన, రవాణా చేసిన ఎవరి దగ్గరైనా ఉన్నా గాని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వగలరని, డీఎస్పీ శ్రీనివాసులు తెలపాలన్నారు. ఈ తనిఖీల్లో సదాశివనగర్ సిఐ  సంతోష్,  ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు, సదాశివ నగర్ ఎస్ఐ రంజిత్, జిల్లాలోని పలువురు ఎస్ఐలు, ఆబ్కారి శాఖకు చెందిన సీఐ షాకీర్ , ఎస్ఐ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.