25-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు(అమీన్ పూర్), ఆగస్టు 24: పటాన్ చెరు నియోజకవర్గంలో వెనకబడిన వర్గాలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. వడ్డెర కులస్తుల సంక్షేమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మంజీర నగర్ లో నూతనంగా నిర్మించిన వడ్డెర సంగం కమ్యూనిటీ హాల్ ను ఆదివారం సాయంత్రం ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వడ్డెరల సంక్షేమానికి ఎల్లప్పుడు అండగా ఉంటున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వడ్డెరలకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
వడ్డెర సామాజిక వర్గంలోనూ ఉన్నత చదువులు చదువుతూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొల్లూరి మల్లేష్, గోపాల్, ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు రుశ్వంత్ రెడ్డి, యునూస్, దాసు, వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు కొమురయ్య, సంఘం ప్రతినిధులు, తదితరులుపాల్గొన్నారు.