25-08-2025 09:18:16 AM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని సీతంపేట గ్రామ సమీపంలో గొర్ల మంద వద్ద గొర్ల కాపరులు పెద్ద కొండచిలువను(Python ) హతమార్చారు. గ్రామానికి చెందిన కురాకుల రాయమల్లు యాదవ్, రజనీకాంత్ యాదవ్ ల గొర్ల మంద వద్ద కొండచిలువ కనిపించగా, గొర్ల కాపర్లు ఆ కొండచిలువను చూసి హైరానా పడ్డారు. ఆ కొండచిలువ గొర్రెలను పట్టిందే కు వచ్చిందని గమనించిన గొర్ల కాపర్లు వెంటనే ఆ కొండచిలువను అతి కష్టంగా హతమర్చారు. అటవీ సమీపంలో ఉన్న గ్రామంలోకి కొండచిలువలు ప్రవేశిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.