పోలీసుల సంక్షేమానికి సరికొత్త భరోసా
డీజీపీ శివధర్ రెడ్డి
సికింద్రాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): తెలంగాణ పోలీసుల సంక్షేమానికి మరింత ఊతమిచ్చే దిశగా పోలీస్ శాఖ మరో కీలక అడుగు వేసింది. తెలంగాణ పోలీస్ సం క్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో బేగంపేటలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్ ను రాష్ట్ర డీజీపీశివధర్ రెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ ఐజీపీ గజరావు భూపాల్తో కలిసి ప్రారంభించి, పెట్రోల్ బంక్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..
పోలీసు సిబ్బందివారి కుటుంబాల అభివృద్ధికి ఈ ఇంధన కేంద్రం ఆదా యం ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు. ఏర్పాటు చేసిన ఈ బంక్ ద్వారా ప్రజలకు నాణ్యమైన, కల్తీలేని ఇంధనాన్ని అందించడమే కాకుండా, తద్వారా వచ్చే లాభాలను పోలీస్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా సిబ్బంది అవసరాలకు వినియోగిస్తామని వివరించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతా ధికారులతో పాటు ఐఓసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.




