15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అభిమానాన్ని చాటుకున్న బీఆర్‌ఎస్ వీరాభిమాని

20-12-2025 01:37 AM

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), డిసెంబర్19: ఇటీవల జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నున్న యాదగిరి తన సమీప ప్రత్యర్థిపై 78ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. దీంతో గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ వీరాభిమాని నున్న మహేష్ యాదవ్ పార్టీపై ఉన్న అభిమానం, తన అన్న గెలవాలని కోరుతూ స్వామివారికి మొక్కుకున్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రం సూర్యాపేట సమీపంలోని దురాజ్ పల్లి వద్దగల లింగమంతుల స్వామి(పెద్దగట్టు) దేవాలయంలో తన తలనీలాలను స్వామివారికి సమర్పించి తమ అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మాండ్ర గోవర్ధన్, గ్రామశాఖ అధ్యక్షుడు తొడుసు వీరమల్లు నాయకులు నున్న సురేష్, వల్లపు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.