16 April, 2026 | 6:26 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

28-01-2026 12:00 AM

ధర్మపురి, జనవరి27(విజయక్రాంతి): ఎండపల్లి గ్రామ సర్పంచ్ మారం సునీత జలందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. గడ్డం స్వామీ రెడ్డి జన్మదినం సందర్బంగా ఫార్చూన్ హాస్పిటల్ కరీంనగర్ గార్ల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులు మె రుగుపర్చేందుకు వైద్య శిభిరాలు ఎంతో ఉపయోగపడుతాయనీ సర్పంచ్ పేర్కొన్నారు.

పేద ప్రజలకు తమ వంతు సహాయంగా వైద్య శిబిరం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్బంగా సర్పంచ్ తెలిపారు. వైద్య శిబిరం నిర్వహణ పట్ల ఎండపల్లి గ్రామస్థులతో పాటు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు సర్పంచ్ మారం సునీత జలందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.