09-01-2026 12:00:00 AM
కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి
పటాన్ చేరు, జనవరి 8: అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ ని రామచంద్రపురంలో ఏర్పాటు చేయాలని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి కోరారు. గురువారం జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్నన్ ను కలిసి కలిసి వినతి పత్రం అందజేశారు. రామచంద్రపురం ప్రాంతం ప్రధాన రహదారిపై ఉండటంతో జిహెచ్ఎంసి సేవల పొందేందుకు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్ విషయాన్ని పరిశీలించి ఉన్నతాధికారుల కు నివేదిస్తానని వెల్లడించారు.