11 May, 2026 | 12:16 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా డే

22-06-2024 01:17 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి) : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) హైదరాబాద్ జోనల్ ట్రైనింగ్ సెంటర్ క్యాంపస్‌లో అంతర్జాతీయ యోగా డే శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ జీబీవీ రామయ్య మాట్లాడుతూ.. ఈ సంవత్సరం సమాజం కోసం యోగా అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నట్టు తెలిపారు. యోగాపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. యోగా గురువు కరుణాకర్, ఎల్‌ఐసీ సీనియర్ అధికారులు కె. థామస్, రాజీబ్ బిస్వాస్, జి. మధుసూధన్, ప్రమోద్ కుమార్ సాహూ, ఆర్. శరవణన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజూ ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకూ ఇందిరాపార్కు లో జరిగే ఉచిత యోగా శిక్షణ తరగతులను ఎల్‌ఐసి స్పాన్సర్ చేస్తుందన్నారు.