11 May, 2026 | 1:27 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

రుణమాఫీతో 7.74 లక్షల మందికి లబ్ధి

22-06-2024 01:16 AM

మంత్రి తుమ్మలను కలిసిన తాండూరు ఎమ్మెల్యే, టెస్కాబ్ అధ్యక్షుడు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు 7,74,833 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని టెస్కాబ్ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్‌సీఏబీ) అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. టెస్కాబ్ ఉపాధ్యక్షుడు కొత్తకుర్మ సత్తయ్య, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ డీసీసీబీ చైర్మన్లు చిట్టి దేవేందర్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డి, కొరమోని వెంకటయ్య, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.