రుణమాఫీతో 7.74 లక్షల మందికి లబ్ధి
మంత్రి తుమ్మలను కలిసిన తాండూరు ఎమ్మెల్యే, టెస్కాబ్ అధ్యక్షుడు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు 7,74,833 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని టెస్కాబ్ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్సీఏబీ) అధ్యక్షుడు మార్నేని రవీందర్రావు, తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. టెస్కాబ్ ఉపాధ్యక్షుడు కొత్తకుర్మ సత్తయ్య, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, వరంగల్ డీసీసీబీ చైర్మన్లు చిట్టి దేవేందర్రెడ్డి, అడ్డి భోజారెడ్డి, కొరమోని వెంకటయ్య, ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






