calender_icon.png 15 October, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్పీ సాధించిన వ్యక్తికి ఘన సన్మానం

14-10-2025 08:29:28 PM

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో గ్రూపు-1లో డీఎస్పీగా పోస్టింగ్ పొందిన జాటోత్ బాలాజీ కుమారుడు జాటోత్ విజయ్ కుమార్ ని మరిపెడ మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం వారి స్వహగృహం ఆర్లగడ్డ తండాలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాలు నాయక్, హరి నాయక్, టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు అజ్మీరా రెడ్డి నాయక్, రవి, గంధసిరి కృష్ణ, హరి నాయక్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.