01-07-2025 01:33:17 AM
రామగిరి, జూన్ 30(విజయ క్రాంతి); రామగిరి మండలంలోని కల్వచర్ల లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు తూము శోభన్ రావు పదవి విరమణ సందర్భంగా సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉపా ధ్యక్షులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కొముర య్య, మాజీ సర్పంచ్ గంట పద్మ మాజీ జెడ్పిటిసి వెంకటరమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఉపసర్పంచ్ కనకయ్య తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.