calender_icon.png 4 January, 2026 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ప్రజా ప్రభుత్వం

03-01-2026 12:00:00 AM

కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముసుకుల సురేందర్ రెడ్డి

మంథని, జనవరి 2(విజయ క్రాంతి): సన్న ధాన్యానికి బోనస్ తో వ్యవసాయాన్ని పండగగా మార్చిన ప్రజా ప్రభుత్వం కు కృతజ్ఞతలు తెలుపుతూ మంథని మండలంలోని  కన్నాల లో రైతులు, కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య లు అన్నారు.  గత ప్రభుత్వంలో వరి పంట వేస్తే ఉరి  అన్న ప్రభుత్వం దానికి తోడు ప్రతి బస్తాకు రెండు మూడు కిలోల తరుగు తీస్తూ వ్యవసాయరే రైతులను నిలువు దోపిడీ చేస్తూ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేని పేస్టో   కమిటీ చైర్మన్ గౌరవ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు  ఇచ్చిన హామీ మేరకు సన్నధాన్యానికి రూ. 500 రూపాయలు  రైతుల అకౌంట్లో బోనస్ డబ్బులు వేస్తూ రైతుల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్న సందర్భంగా అలాగే కన్నాల గ్రామ ప్రజలు అడిగిన వెంటనే నాగారం ఎక్స్ రోడ్డు నుండి కన్నాల వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రెండు కోట్ల 50 లక్షల రూపాయలు అలాగే కన్నాల మల్లెపెళ్లి లింకురోడ్డు కోటి 80 లక్షల రూపాయలు, మొత్తం నాలుగు కోట్ల 30 లక్షల రూపాయల నిధులు రోడ్ల విస్తరణకు మంత్రి కృషి చేశారని కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో  ఏఎంసి వైస్ చైర్మన్ ముసుకుల ప్రశాంత్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి తోకల మల్లేష్, కిసాన్ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు పాపిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావటి సమ్మయ్య యాదవ్, కావటి సందీప్ యాదవ్ బుధారపు రాజయ్య, నాంపల్లి వెంకటి, ఎన్ రెడ్డి బాలమల్లు, గ్రామ మహిళలు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.