17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

స్టెప్పేస్తే భూకంపం..

14-12-2025 01:13 AM

గబ్బర్ సింగ్’ తర్వాత హీరో పవన్‌కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైతీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలైంది. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం రాజమండ్రిలో జరిగింది. దర్శకుడు హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, నిర్మాత నవీన్ యెర్నేని, గీత రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.

‘రంపంపం రంపపం.. స్టెప్పేస్తే భూకంపం.. ధమ్ ధమ్ ధమ్ రిథమ్ ధమ్.. జోరుమీద హోరుగాలి రప్పిద్దాం.. బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా.. రే ఆఫ్ హోపే తగ్గుతున్నా.. థగ్ ఆఫ్ వారే జరుగుతున్నా.. టేకాప్ లేటయ్యినా.. దేఖ్‌లేంగే సాలా.. చూసినాం లే చాలా..’ అంటూ సాగుతోందీ గీతం. దేవిశ్రీ స్వరపర్చిన ఈ గీతానికి భాస్కరభట్ల రాసిన సాహిత్యం అందించగా విశాల్ దద్లానీ ఆలపించారు.