calender_icon.png 10 January, 2026 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినుల క్రీడా అభివృద్ధికి ముందడుగు

08-01-2026 12:23:52 AM

బేగంపేట్ ఉమెన్స్ కాలేజ్లో సంసద్ ఖేలో మహోత్సవ్ చర్చలు

సనత్‌గర్, జనవరి 7 (విజయక్రాంతి):- కేంద్ర మంత్రి మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్‌రెడ్డి సూచనల మేర కు, బుధవారం బేగంపేట్ ఉమెన్స్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ సుప్రియని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి సంసద్ ఖేలో మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కాలేజ్ విద్యార్థినులు వివిధ క్రీడా టోర్నమెంట్లలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించాలని ఆహ్వా నం అందించారు. దీనికి స్పందించిన సుప్రియ, విద్యార్థినులతో జట్లను సిద్ధం చేసి టోర్నమెంట్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షుడు మహేష్, జిల్లా నాయకుడు సి. విజయ్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు టి. శ్రవణ్, బాబు రావు పాల్గొన్నారు.