13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

రైల్వే స్టెనోగ్రాఫర్లకు ‘జీవితకాల సాఫల్య పురస్కారం

08-01-2026 12:25 AM

పాల్గొన్న డా.మర్రి రాఘవయ్య

సికింద్రాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): స్టెనోగ్రాఫర్లు దైవంగా భావించే సర్ ఐజాక్ పిట్మన్ స్మారకార్థం బుధవారం సికింద్రాబాద్లోని రైల్వే క్రీడా ప్రాంగణంలో (ఆర్‌ఎస్సి)లో దక్షిణ మధ్య రైల్వే స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ చారిత్రాత్మక వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్‌ఎఫ్‌ఐఆర్/ ఎస్సిఆర్‌ఇఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.రాఘవయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం జోనల్ అధ్యక్షులు టి.అనిల్ కుమార్,జోనల్ కార్యదర్శి జె. రామకృష్ణ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎం.రాఘవయ్య ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలో సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దా లుగా స్టెనోగ్రాఫర్ల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఏడుగురు ప్రముఖ స్టెనోగ్రాఫర్లకు ‘జీవితకాల సాఫల్య పురస్కార జ్ఞాపిక‘, సన్మాన పత్రం అందజేసి సత్కరించారు.