calender_icon.png 6 August, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన

06-08-2024 02:37:04 AM

  • షాద్‌నగర్ డీఐ రామ్‌రెడ్డి, ఐదుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి, ఆగస్టు 5 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో దళిత మహిళపై జరిగిన థర్డ్ డిగ్రీ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) రామ్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

దీంతో నివేదిక సమర్పించాలని షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామిని సీపీ అవినాశ్ మహంతి ఆదేశించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి సోమవారం సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు. డీఐ రామ్‌రెడ్డితో పాటు కానిస్టేబుళ్లు కరుణాకర్, రాజు, మోహన్‌లాల్, అఖిల, జాకీర్‌పై సస్పెన్షన్ వేటు పడింది.