26 May, 2026 | 12:57 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

కరీంనగర్ నాకా చౌరస్తాలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలి

15-10-2025 07:21 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని నాకా చౌరస్తాలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ కోరారు. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత పదకొండవ రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం అంతకుముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేసారని, 1998లో భారతదేశ పాక్రాన్. 2, అను పరీక్షల్లో కీలకమైన సంస్థగత, సాంకేతికలో అబ్దుల్ కలాం కీలక పాత్ర పోషించారన్నారు. అబ్దుల్ కలాం భావితరాలకు గుర్తుండిపోయేలా  ఆయన విగ్రహాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎండీ ముజీబ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.