15-10-2025 07:18:42 PM
నిర్మల్ రూరల్: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా పలు డివిజన్లకు నిర్మల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు జుబేద్ మహిముద్ ను నియమిస్తూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందించారు. పలు డివిజన్లో ఈయన కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మైనార్టీ వార్డులో ఇన్చార్జిగా నియమించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.