మఠంపల్లిలో అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా.. భక్తులతో మార్మోగిన ఆలయం
మఠంపల్లి: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి అభిషేకం, పడిపూజ ఘనంగా నిర్వహించారు. బత్తుల తిరుపతయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ బుధవారం అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాల మధ్య కొనసాగింది.
భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజ తరువాత పంచామృతాభిషేకం, కుంకుమ, చందన పసుపు బస్మాభిషేకాలను చేశారు. మహా మంగళ హారతితో పూజా కార్యక్రమాలు ముగిశాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి భారీగా అయ్యప్ప మాలధారణ భక్తులు హాజరై అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తుల పాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు, భక్తులు ప్రజలు పాల్గొన్నారు.






