16-10-2025 12:00:00 AM
పదర, అక్టోబర్ 15: పదర మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప భక్తులు అచ్చంపేట మండల ఉమామహేశ్వరం దేవాలయంలో బుధవారం గురు స్వాములు మండి అంజయ్య, పాండు, చారి ఆధ్వర్యంలో సుమారు 40 మందిపైగా భక్తులు భక్తిశ్రద్ధలతో మాల ధారణ చేశారు.
ఈ సందర్భంగా స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో ఆలయం మార్మోగింది. అనంతరం స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ వేసిన స్వాములకు నియనిబంధనలతో ఉండాలని భక్తులకు గురుస్వామి మండి అంజయ్య యాదవ్సూచించారు.