వరుణుడి కోసం కృష్ణా జలాలతో గ్రామదేవతలకు అభిషేకం
20-07-2026 01:34 AM
అయిజ, జులై 19: అయిజ మండలంలోని యాపదిన్నె గ్రామంలో వర్షం కోసం రైతులంతా కలసి ఎడ్లబండ్లతో బీచుపల్లి వెళ్లి అక్కడి ఆంజనేయ స్వామికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అనంతరం కృష్ణానదిలోని పవిత్ర జలాలతో యాపదిన్నె గ్రామానికి వచ్చి ఆ జలాలతో గ్రామంలోని ఆంజనేయస్వామి, మహాశివుడు, చెన్నకేశవ స్వామి అభిషేకాలు నిర్వహించారు. భారీగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి వరుణ దేవుని కోరామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.






