వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
20-07-2026 01:33 AM
అలంపూర్, జూలై 19:వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ మానవపాడు మండల కేంద్రంలోని ముస్లిం మైనారిటీ సోదరులు ఆదివారం గ్రామ శివారులో ప్రత్యేక ప్రార్థనలు (సలాతుల్ ఇస్తిస్కా) నిర్వహించారు. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఒకచోట చేరి అల్లాహ్ను ప్రార్థించారు.ఈ సందర్భంగా ఇమామ్ వర్షాల ప్రాముఖ్యత, ప్రకృతి సమతుల్యత, రైతుల సంక్షేమం గురించి సందేశం అందించారు.
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ప్రత్యేక దువా చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.






