11-06-2025 02:12:41 PM
సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: గోదావరిఖని ఏసీపీ రమేష్
గోదావరిఖని,(విజయక్రాంతి): గోదావరి ఖనిలో ప్రభుత్వ ఆసుపత్రిని, సింగరేణి హాస్పిటల్ లలో భద్రత పై ప్రత్యేక నిఘా ఉంచామని ఏసీపీ మడత రమేష్(Godavarikhani ACP Madatha Ramesh) తెలిపారు. సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్ లో భద్రత చర్యలలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, పనితీరు, భద్రత సిబ్బంది పనితీరు, హాస్పిటల్ లలోని వార్డ్స్, పరిసరాలను ఏసీపీ రమేష్ గోదావరిఖని-1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి బుధవారం సందర్శించి, పరిసరాలను పరిశీలించి భద్రతా చర్యలపై పలు సూచనలు సలహాలు పాటించాలని పేర్కొన్నారు. భద్రత పై ఇటీవల ఆసుపత్రి సిబ్బందిపై దాడి జరిగిన సంఘటనల గురించి రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో ఆసుపత్రుల నుండి పిల్లల కిడ్నాప్ ల గురించి మొదలైన విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఏసీపి హాస్పిటల్ అధికారులతో సూపరడెంట్స్ తో మాట్లాడుతూ... ప్రభుత్వ, సింగరేణి ఆసుపత్రికి వివిధ ఆరోగ్య సమస్యలతో ఇతర కారణాలతో చాలామంది వస్తుంటారు. అదేవిదంగా కొంతమంది అనుమానస్పదంగా హాస్పిటల్ ప్రాంతంలలో తిరుగుతుంటారని, గతంలో కొన్ని సందర్భాల్లో పిల్లలను అపహరించడం, చికిత్స జరుగుతున్న సమయంలో ఎవరైనా మరణించిన సందర్భాలలో బంధువులు కుటుంబ సభ్యులు దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందన్నారు. ముందస్తు భద్రత, రక్షణ లో భాగంగా ఆస్పత్రి తప్పనిసరిగా సిసి ఎంట్రన్స్, ఎగ్జిట్ మెయిన్ రోడ్లపై, ఆస్పత్రి ఎంట్రెన్స్ వద్ద అదేవిదంగా ఎమర్జెన్సీ వార్డ్, చిల్డ్రన్ వార్డ్, మెటర్నటీ వార్డ్, క్యాజువల్ వార్డ్ లలో, వార్డ్స్ ఎంట్రెన్స్, ఎగ్జిట్ ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలు పనితీరును ఎప్పటికప్పుడు చూడాలని, పని చేయని వాటిని మెయింటైన్స్ చెక్ చేసి పనిచేసే విధంగా చూడాలని సూచించారు. హాస్పిటల్ లు అని ప్రాంతాలు పూర్తి స్థాయిలో కవర్ అయ్యే విధంగా నిఘా నీడలో ఉండే విధంగా హై రెజల్యూషన్ కలిగిన కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి పనితీరుపై పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండాలని, హాస్పటల్ సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానస్పదంగా కనిపించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు హాస్పటల్ పరిసరాలలో జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎంఓలు, సూపరిండెంట్స్, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు.