23 June, 2026 | 11:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఆశ వర్కర్ల సమస్యలపై స్పందించాలి

14-03-2026 02:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బడ్జెట్ల కేటాయింపు జరిగేలా చూడాలని ఆశా వర్కర్ యూనియన్ శనివారం ఎమ్మెల్యే నివాసంలో వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యేలు తక్షణ స్పందించాలని వారు నినాదాలు చేశారు.

జిల్లా గౌరవ అధ్యక్షులు సుజాత అధ్యక్షులు చంద్రకళ మాట్లాడుతూ.... అదేవిధంగా ఆశా వర్కర్లకు రూ.50 లక్షల బీమా, వైద్య ఖర్చులకు రూ.50 వేల ఆర్థిక సాయం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా పథకాలు అమలు చేయాలని, పదవీ విరమణ సమయంలో రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని కోరారు. వారానికి ఒక రోజు సెలవు, పండుగల సందర్భంగా ప్రత్యేక సెలవులు ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశా వర్కర్లకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.