కూలీల మృతికి కారణమైన డ్రైవర్పై వేటు
సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు
సిరిసిల్ల , జూలై 13, (విజయ క్రాంతి): వేములవాడ అర్బన్ మండలం అనుపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీల మృతికి కారణమైన ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ ఎం నరన్ (బ్యాడ్జ్ నెం. 52247)ను విధుల నుంచి తొలగించారు. సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాశ్రావు ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న కూలీలను హైర్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించిన అధికారులు, అతనిపై తక్షణ చర్యగా విధుల నుంచి తొలగించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.






