calender_icon.png 19 January, 2026 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భిక్కనూరు ప్రజావాణిలో ఫిర్యాదులపై తక్షణ చర్యలు

19-01-2026 07:22:55 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని భిక్కనూరు తహశీల్దార్ సునీత సూచించారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని, నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.